మొదటిసారి ఆ హీరోయిన్ కు జిందాబాద్ కొట్టిన కంగనా రనౌత్..!!

-

డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం సీతారామం . ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల ఠాకూర్ ఎంతో అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. ఈ సినిమాలోని కీలకమైన పాత్రలో హీరోయిన్ రష్మిక కూడా నటించింది. ఇదే చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేయడం జరిగింది. అక్కడ కూడా మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. అయితే ఎప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీల పైన విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగానా రనౌత్ ఈ సినిమాపై తనదైన శైలిలో రివ్యూ ఇవ్వడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

కంగాన రనౌత్ ఇలా రాసుకోస్తూ.. చివరికి సీతారామం చిత్రాన్ని చూసే సమయం ఇప్పుడు దొరికింది.ఈ సినిమా చూశాను అద్భుతమైన అనుభూతికి లోనయ్యాను చరిత్రలో నిలిచిపోయో సినిమా ఇది అని తెలిపింది.

ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి దర్శకత్వం స్క్రీన్ ప్లే అందించిన హను రాఘవపూడి గారికి నా అభినందనలు ఈ సినిమాలో అన్ని స్క్రీన్స్ కూడా చాలా అద్భుతంగా కనిపించాయి.నటీనటులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా మృనాల్ ఠాగూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి అని ఇలా చెప్పుకొస్తోంది.

మృణాల ఠాగూర్ ఆమె పాత్రలో చాలా ఎమోషన్స్ గా, హుందాతనంతో పర్ఫెక్ట్ గా నటించిందని తెలిపింది. మరొక నటి అయితే ఆమె పాత్రను చేయలేదని తెలియజేసింది. అందుచేతనే డైరెక్టర్ ఆమెను ఈ పాత్ర కోసం ఎంచుకున్నారని నిజమైన మహారాణి మృణాల్ ఠాగూర్ అని తెలియజేసింది. అంతేకాకుండా జిందాబాద్ మృనాల్ ఠాగూర్ సాబ్.. నీ హవా మొదలైంది అంటూ కంగాన రనౌత్ ప్రశంసల వర్షం కురిపించింది. దీంతో మొదటిసారి కంగానా లో ఒక హీరోయిన్ పై ఊహించని కామెంట్స్ చేసిందని పలువురు నెటిజన్లు సైతం కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇక ఎన్నో సినిమాలు విడుదలైనప్పటికీ కంగానా మొదటిసారిగా సీతారామం సినిమా మెప్పించిందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news