ఏపీ రైతులకు శుభవార్త..త్వరలోనే ‘మిల్లెట్‌ మిషన్‌ పాలసీ’

-

ఏపీ రైతులకు మంత్రి కురసాల కన్నబాబు శుభవార్త చెప్పారు. ఏపీలో త్వరలోనే మిల్లెట్‌ మిషన్‌ పాలసీ ని తీసుకువస్తామని.. దీని ద్వారా చిరుధాన్యాల సాగుకు మరింత ఊతమిస్తామని మంత్రి కన్నబాబు ప్రకటన చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించిన రైతు భరోసా కేంద్రం వ్యవస్థ ఒక విప్లవమని.. దీని ద్వారా ప్రతి గ్రామంలోనూ రైతుకు సొంత కార్యాలయం ఉందనే ధీమ కలిగిందని చెప్పారు.

టీడీపీ సభ్యులు ఈ స్థాయిలో దిగజారిపోయారని అస్సలు ఊహించలేదని… టీడీపీ సభ్యులు బిచ్చగాళ్లలా వ్యవహరిస్తున్నారని ఆయన మండి పడ్డారు. పెద్దల సభలో చిల్లరగా గలాటా చేస్తున్నారని.. శాసనమండలి ఛైర్మన్‌పట్ల లోకేష్‌ అమర్యాదగా ప్రవర్తించారని ఆగ్రహానికి గురి చేశారు. చంద్రబాబు బయటనుంచి సభను కంట్రోల్‌ చేయాలని చూస్తున్నారన్నారు కురసాల కన్నబాబు.

టీడీపీ చెబుతున్న బ్రాండ్‌లన్నీ.. సీ బ్రాండ్‌లే – కురసాల కన్నబాబుధికార వ్యవస్థ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు గంతో చెప్పిందని వెల్లడించారు. సమాజం పట్ల పూర్తి బాధ్యత ఉందని సుప్రీంకోర్టు గతంలో ప్రకటించిందని… జ్యుడీషియల్‌ యాక్టివిజం పేరుతో కోర్టులు విధులు నిర్వహించరాదని చెప్పిందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news