Puneeth Rajkumar : పునీత్ కళ్ళతో వారి జీవితాల్లో వెలుగులు.. ఎంత‌మందికి కంటి చూపు వ‌చ్చిందంటే?

-

Puneeth Rajkumar : కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్‌.. మరణానంతరం కూడా తన దాతృత్వం చాటుకున్నారు. పునీత్ దానం చేసిన కళ్లతో నలుగురికి జీవితాల్లో వెలుగులు నిండాయి. వారికి కంటిచూపు ద‌క్కింది. సాధారణంగా దానం చేసిన కండ్ల‌తో ఒక్క‌రూ లేదా ఇద్దరికీ మాత్రమే చూపు దక్కుతుంది. కానీ, ఆధునాతన సాంకేతికతతో పునీత్ కళ్ళలోని కార్నియాలను వేరు చేసి అంథులైన నలుగురికి కంటిచూపు తెచ్చారు నారాయణ నేత్రాలయ వైద్యులు.

ఒకే రోజే న‌లుగురు జీవితాల్లో వ‌చ్చింద‌ని వారిలో ఒక మహిళ మరియు ముగ్గురు పురుషులు ఉన్నారని నారాయణ నేత్రాలయ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భుజంగ్ శెట్టి తెలిపారు. పునీత్ మర‌ణాంత‌రం కళ్ళు సేకరించామని మరుసటి రోజు వాటిని మార్పిడి చేశామన్నారు.

కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ మరణానంతరం ఆయ‌న కండ్ల‌ను కుటుంబ సభ్యులు దానం చేస్తారు. ఆ తర్వాత 2017లో పునీత్ తల్లి పార్వతమ్మ కళ్లను కూడా దానం చేశారు. వారి అడుగుజాడల్లోనే నడిచిన కుటుంబం పునీత్‌ నేత్రాలను కూడా దానం చేసింది.

కాగా, క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ శుక్రవారం ఉదయం తన జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న సమయంలో ఛాతీనొప్పి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నొప్పుతో కుప్పకూలిన ఆయన్ను వెంటనే బెంళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆ తర్వాత కాసేపటికే పునీత్‌ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ విష‌యం తెలియడంతో య‌వత్తు సినీ జ‌గ‌త్తు శోక సంద్రంలో మునిగిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news