ఏపీవ్యాప్తంగా టీడీపీ కాంతితో క్రాంతి కార్యక్రమం

-

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ.. చంద్రబాబుకు
సంఘీభావంగా కాంతితో క్రాంతి కార్యాచరణకు టీడీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. నేటి రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ఇళ్లలో లైట్లు ఆపేసి, కొవ్వొత్తులు వెలిగించాలని, సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేయాలని, వాహనదారులు లైట్లు వెలిగించి నిరసన తెలపాలని టీడీపీ నాయకత్వం పిలుపునిచ్చింది. ఆ మేరకు ఇవాళ టీడీపీ శ్రేణులు కాంతితో క్రాంతి కార్యాచరణ చేపట్టాయి.

ఢిల్లీలో నారా లోకేశ్ కొవ్వొత్తి చేతబూని చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లోకేశ్ తో పాటు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, టీడీపీ మద్దతుదారులు పాల్గొన్నారు. సేవ్ ఏపీ, సేవ్ డెమొక్రసీ అంటూ నినాదాలు చేశారు.

ఇక, నారా భువనేశ్వరి రాజమండ్రిలో కాంతితో క్రాంతి కార్యక్రమం నిర్వహించారు. ప్రమిదలు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం
ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరితో పాటు తెలుగు మహిళలు కూడా దీపాలు వెలిగించి చంద్రబాబు అరెస్ట్ ను
నిరసించారు.

Read more RELATED
Recommended to you

Latest news