వైఎస్ క్రెడిట్ బాబు కొట్టేయాలని చూస్తున్నారు: విజయసాయి

-

వైసీపీ నగర పార్టీ కార్యాలయం లో దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మన నుంచి దూరమై 11 ఏళ్ళు అయిన ప్రజలు గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన వ్యాఖ్యలు చేసారు. కరోనా కష్ట కాలం లో రాష్ట్రాన్ని అభివృద్ధి పదం లో నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి అభినందనలు తెలిపారు.

విశాఖ ను అభివృద్ధి చేసిన వ్యక్తి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన స్పష్టం చేసారు. నేను విశాఖ ను అభివృద్ధి చేసాను అని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని, విశాఖ అభివృద్ధి అంతా వైఎస్ హయాంలో నే జరిగిందని గుర్తు చేసారు. ఎన్నికలు ముందు ప్రతి వార్డు లో పర్యటించి వారి సమస్యలు తెలుసుకుంటానని, రానున్న జీవీఎంసీ ఎన్నికలలో వైసీపీ జెండా ఎగురవేయాలన్నారు ఆయన.

Read more RELATED
Recommended to you

Latest news