నువ్వు సూపరహే: నష్టపరిహారం చెల్లించి క్షమాపణలు చెప్పిన కర్ణాటక ఎంపీ !

-

గత వారంలో కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా కర్ణాటక లో మే 10 న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి హాజరయ్యారు. ఈ ప్రచారంలో గడంగ్ జిల్లా లో ర్యాలీ జరుగుతున్న సమయంలో అటుగా రోడ్ పై ఒక కూల్ డ్రింక్ వ్యాన్ రావడంతో, బీజేపీ కార్యకర్తలు అందులో ఉన్న రూ. 35 వేలు విలువ చేసే కూల్ డ్రింక్స్ ను ఖాళీ చేసేశారు. అయితే ఈ విషయం గురించి ఒక నెటిజన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. అది తెలుసుకున్న కర్ణాటక బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ స్పందిస్తూ కూల్ డ్రింక్ యజమాని నష్టానికి పూర్తి బాధ్యత వహిస్తూ రూ. 35 వేలు అతనికి చెల్లించారు.

ఈ స్క్రీన్ షాట్ ను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆ కూల్ డ్రింక్ వ్యాన్ యజమానికి క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, బీజేపీ ఎంపీ స్పందించిన తీరు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాయకుడు అంటే ఇలా ఉండాలి అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news