కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం.. ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చాయంటే..

-

కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీ సాధించింది. ఏకంగా 136 నియోజకవర్గాలలో జయకేతనం ఎగురవేసింది. మరోవైపు బిజెపి 65 స్థానాలలో విజయం సాధించి రెండవ స్థానానికే పరిమితమైంది.

కింగ్ మేకర్ అవుతామని ప్రకటించిన జెడిఎస్ పార్టీ 19 స్థానాలనే గెలుచుకుంది. ఇక ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపులో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కీలకపాత్ర పోషించింది. రాహుల్ పర్యటించిన జిల్లాల్లో పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 51 నియోజకవర్గాలలో రాహుల్ యాత్ర చేయగా.. 36 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news