రేపే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. కౌంటింగ్​కు సర్వం సిద్ధం

-

దేశమంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. కన్నడ కస్తూరి ఎవరికి దక్కనుందే త్వరలోనే తేలనుంది. ఈ ఫలితాల కోసం బీజేపీ, కాంగ్రెస్, స్థానిక పార్టీలతో పాటు యావత్ దేశం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో రేపు జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నకల కౌంటింగ్​కు సర్వం సిద్ధమైంది.

కన్నడనాడి ఎవరు సరిగ్గా పట్టుకున్నారో రేపు తేలనుంది. అయితే సంప్రదాయం ప్రకారం కర్ణాటక అధికారం చేతులు మారుతుందా? లేదా చరిత్ర సృష్టిస్తూ బీజేపీనే అధికారంలో కొనసాగుతుందా? లేదా ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు నిజమవుతాయా? వీటిన్నంటికి సమాధానాలు మరికొద్ది గంటల్లో తేలిపోతుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపునకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. శనివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రారంభం కానుంది. మొత్తం 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు​ జరగనుంది. మధ్యాహ్నం వరకు ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కౌంటింగ్​ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news