కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపిస్తాం – కర్నె ప్రభాకర్

-

మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా.. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని.. పార్టీ అధినేత సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఉద్యమకారుడుగా పార్టీ ఆవిర్భావ కాలం నుంచీ కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే కోరుకుంటూ, స్థానిక నాయకులు కార్యకర్తలు, జిల్లా పార్టీ నాయకత్వం, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టలను పరిశీలించిన మీదట సిఎం కెసిఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Karne Prabhakar

అయితే.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు ప్రకటించడంపై.. కర్నె ప్రభాకర్ స్పందించారు. కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ బలోపేతం కోసమే.. కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపిస్తాం.. మునుగోడులో ఎలాంటి అసంతృప్తి లేదన్నారు కర్నె ప్రభాకర్. సీఎం కేసీఆర్‌ ఆదేశాలు పాటిస్తా.. టికెట్‌ ఆశించడం తప్పుకాదు.. నా అవసరం జాతీయ రాజకీయాల్లో ఉందని సీఎం అన్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news