ఈనెల 9న నర్సాపూర్ లో సభ..బీజేపీలో భారీ చేరికలు : ఈటల

-

మెదక్ నర్సాపూర్ లో ఈ నెల 9న జరగబోయే బీజేపీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఈ బహిరంగ సభకు కేంద్ర మంత్రులు భూపేంద్ర సింగ్ యాదవ్, కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరుకానున్నారు. బహిరంగ సభలో బీజేపీలో భారీగా చేరికలు ఉంటాయని పేర్కొన్నారు ఈటల.

సీఎం కేసీఆర్ కు బిజెపి భయం పట్టుకుంది.. బిజెపి నేతలు జిల్లాలో ఎక్కడ తిరిగినా వారి ఇన్ఫర్మేషన్ కేసీఆర్ తీసుకుంటున్నారన్నారు ఈటెల రాజేందర్. TRS ప్రభుత్వంలో గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు 100 మందికి ఒక షాపు పెట్టించిన ఘనత తెలంగాణ ప్రభుత్వనిది.. ఒక సంవత్సరానికి మద్యం షాప్ ల మీద 45 వేల కోట్లు వస్తున్నాయని ఆర్థిక మంత్రి తెలియజేయడం ఆశ్చర్యకరం అన్నారు.

హుజురాబాద్ లో 400 కోట్లు రూపాయలు మద్యం కోసం ఖర్చుపెట్టిన ఘనత కేసీఆర్ ది.. మునుగోడు నియోజకవర్గనికి అంబులెన్స్ లలో పోలీసుల వ్యాన్లలో కోట్ల డబ్బులు సరఫరా అవుతుందని తెలిపారు. కేసీఆర్ కు ఉద్యమకారులకు బంధం తెగిపోయిందని పేర్కొన్నారు ఈటెల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Latest news