BREAKING : మునుగోడు బరిలో తెలంగాణ జన సమితి

-

మునుగోడు బరిలో తెలంగాణ జన సమితి ఉండనుంది. త్వరలోనే తెలంగాణ జన సమితి అభ్యర్థిని ప్రకటిస్తామని ప్రకటించారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ఢిల్లీలో కేసీఆర్ కే కాదు.. మాకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారని, తెలంగాణ అసలు స్వరూపాన్ని వివరిస్తామన్నారు.

తెలంగాణ నుంచి జాతీయ నాయకుడు అవుతానని కేసీఆర్ అసలు సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు. కెసిఆర్ తన వైఫల్యాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు చనిపోతే అసలు చర్చ లేకుండా పోయిందన్నారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా పోయాయని అన్నారు. ఇలాంటి అంశాల మీద ఎన్నికలలో చర్చ లేకుండా పోయిందని.. ఎన్ని డబ్బులు ఇచ్చి ఓట్లు కొనాలనేదే పోటీగా మారిందన్నారు. భారత రాష్ట్ర సమితితో ఒరిగేదేమీ లేదన్నారు కోదండరాం. మా జీవితంలో ఎప్పుడూ కూడా ఒకటవ తేదీ తర్వాత జీతంకోలేదని.. కెసిఆర్ ఒకటవ తేదీ జీతం ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news