ఎంపీ కవితకు దక్కిన అరుదైన గౌరవం..

-

తెరాస మహిళా నేత, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు అరుదైన ఘనత దక్కింది. తండ్రికి తగ్గా కూతురిగా పార్లమెంట్ సాక్షిగా సత్తా చాటారు. ఫేమ్ ఇండియా-ఏసియా పోస్ట్ మేగజైన్ 2018 సంవత్సరానికి గాను నిర్వహించిన ‘శ్రేష్ట్ సంసద్ సర్వే’లో ఆమె ఉత్తమ ఎంపీగా నిలిచారు. 10 అంశాల్లో నిర్వహించిన సర్వేలో ఆయె అత్యధిక మార్కులు సాధించుకుని ప్రథమ స్థానంలో నిలిచారు..

దీంతో జనవరి 31న ఢిల్లీ‌లోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో ఎంపీ కవితకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకోనున్నారు. దేశానికి సంబంధించిన పలు అంశాలపై ఆమె తన విలువైన నిర్ణయాలను పంచుకున్నారు. వీటన్నింటికంటే కూడా మహిళ సాధికారిత కోసం కవిత విశేష కృషి చేస్తున్నారు. ఇటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటంలోనూ, తెరాస ప్రభుత్వంలోను తనదైన పరిపాలన ముద్ర వేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news