కవిత తలుచుకుంటే.. మైక్ టైసన్ కి బాక్సింగ్, కోహ్లీకి క్రికెట్ నేర్పుతుంది – ఎంపీ అరవింద్

-

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదవ విడత ప్రజాసంఘాలయాత్ర ముగింపు సభకి విచ్చేసిన ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. కవిత తలుచుకుంటే.. మైక్ టైసన్ కి బాక్సింగ్, విరాట్ కోహ్లీకి క్రికెట్ నేర్పుతోందని.. ఆ విషయం కూడా ఓ టీఆర్ఎస్ ఎంపీ తనతో అన్నాడని చెప్పారు.

తనని వెంటాడి, వేటాడి నా పై నిలబడతా అన్న కవిత.. ఇప్పుడు అయ్యా ఎక్కడ చెబితే అక్కడ పోటీ ఉంటుందని ఎద్దేవా చేశారు. భయం ఉంటే కవిత నిలబడాలని.. లేకపోతే తనపై కేసీఆర్ నిలబెట్టాలని అన్నారు. “తెలంగాణ జాగృతి.. ఇప్పుడు భారత్ జాగృతి అయిందట. ఇక్కడ దోచుకున్న సొమ్మును ఇతర రాష్ట్రాలలో ఓట్ల కోసం ఖర్చు పెడతారట. తెలంగాణ మొత్తాన్ని కెసిఆర్ కు అప్పగించాలన్న డీల్ ను కాంగ్రెస్తో కుదుర్చుకున్నారు.

కాంగ్రెస్ లో బీఫాంలో ఇచ్చేది కూడా కేసీఆర్ ఏ. బిఆర్ఎస్ అంటే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని బేవకూఫ్ ని చేయడమే తప్ప ఇంకేమీ లేదు. లిక్కర్ లేడీ నా ఇంటి పైకి గుండాలను పంపింది. ఆంధ్ర ఎంపీ, టిఆర్ఎస్ ఎంపీ నాతో కవిత అంశం మాట్లాడారు” అని చెప్పారు ఎంపీ ధర్మపురి అరవింద్.

Read more RELATED
Recommended to you

Latest news