2018 ఎన్నికల్లోనే కెసిఆర్ నన్ను ఓడించాలని కుట్ర చేశారు – ఈటల రాజేందర్

-

2018 ఎన్నికల్లోనే తనను ఓడించాలని కేసీఆర్ కుట్ర పన్నారని హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ బొమ్మతో తాను ఎన్నికల్లో గెలవలేదని.. తన సొంత పనితీరుతోనే నెగ్గుకొస్తున్నానని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తిని కేసీఆర్ సహించరని.. అతి విధేయంగా ఉండేవారినే నాయకుడిగా భావిస్తారని అన్నారు. బానిసలా ఉంటేనే కెసిఆర్ లీడర్ లా భావిస్తాడని అన్నారు. తాను ఏ తప్పు చేశానని మంత్రివర్గం నుంచి తొలగించారని ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమంలో ఎవరి పాత్ర ఎంతో ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. తన ఎదుగుదలను ఓర్వలేకనే చిల్లర ఆరోపణలు చేసి మంత్రివర్గం నుంచి తొలగించారని అన్నారు.2018 ఎన్నికల్లో తనను ఓడించాలని కేసీఆర్ కుట్ర పన్నారని.. తనపై చేసిన విధంగానే ఇతర నేతల పైన సీఎం ప్రయోగాలు చేశారని అన్నారు. కానీ వారంతా ఓడిపోయారని.. తాను ఒక్కడు మాత్రమే గెలిచానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news