ఈటలపై చర్యలు ఎందుకు తీసుకోలేదు ? – షర్మిల

-

 

 

 

 

ఈటెల రాజేందర్ పై వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. KCRతో ఏడేండ్లు నడిచిన ఈటెల రాజేందర్.. KCR అవినీతిని ఎందుకు బయటపెట్టడం లేదు. మీ అవినీతి బయట పడుతుందనా? మీరు నిజంగానే ఏ తప్పు చేయకుంటే ఒంటరిగా పోటీ చేయకుండా, బీజేపీలో ఎందుకు చేరినట్టు? అని ప్రశ్నించారు వైయస్ షర్మిల.

కార్పొరేటర్ స్థాయి నుంచి కోట్లకు పడగలెత్తిన బండి సంజయ్.. మత రాజకీయాలు చేస్తూ, రాజకీయ పబ్బం గడుపుతున్నాడు. రేవంత్ రెడ్డిలాగే కాళేశ్వరంలో ముడుపులు అందుకున్నాడు కాబట్టే కాళేశ్వరం అవినీతిపై బండి సంజయ్ నోరు విప్పడం లేదన్నారు షర్మిల.

 

కేసీఆర్ దిక్కుమాలిన నిర్ణయాలతో తెలంగాణ ఆగమైంది. అర్హులకు పింఛన్లు లేవు. కౌలు రైతుకు సాయం లేదు. కుటుంబమంతా పదవులు అనుభవిస్తూ.. వేల కోట్లకు పడగలెత్తారు. కాళేశ్వరంలో కమీషన్లు దోచుకుని, విమానాలు కూడా కొంటున్నారు. కాళేశ్వరం అవినీతిపై పోరాడుతున్న ఏకైక పార్టీ YSR తెలంగాణ పార్టీ అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news