ఓరి నాయనో ఇదేం పిచ్చి..రోజూ అదే పనా..

-

సినీ స్టార్స్ కు ఎలగైతే వీరాభిమానులు ఉన్నారో..అలాగే రాజకీయ నేతలకు కూడా అభిమానులు ఉంటారన్న సంగతి తెలిసిందే..గతంలో చాలా మంది తమ ప్రియమైన నేతల కోసం ఏదొక పని చేస్తూ వార్తల్లో నిలిచారు.తాజాగా ఓ వ్యక్తి తన ప్రియమైన నేతకు ఏకంగా గుడి కట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..వివరాల్లొకి వెళితే..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వీరాభిమాని..ఆయన మన రాష్ట్ర సమితి అధినేత ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఏకంగా గుడిని నిర్మించారు. ఆలయంలో కేసీఆర్ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు.గోగుల శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రస్తుతం తెలంగాణలోని నల్గొండ జిల్లా నిడమానూరు గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కేసీఆర్ అంటే తనకు మొదటి నుంచి అభిమానమని చెప్పుకొచ్చారు. ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ చేస్తున్న ఉద్యమం నుంచి శ్రీనివాస్ తన భావజాలం, స్ఫూర్తికి ఆకర్షితుడయ్యాడు.

ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అవ్వడం తో ఉప్పొంగిపోయాడు. అంతేకాదు ఉద్యోగాల కు సెలవు పెట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ తలపెట్టిన ఉద్యమంలో పాల్గొన్నారు. గోగుల శ్రీనివాస్ తన అభిమానాన్ని చాటుకునేందుకు రూ.20 లక్షలు వెచ్చించి కేసీఆర్ కు గుడి కట్టించాడు. ఆ భూమిని కొని అందులో గుడి కట్టించాడు. అందులో కేసీఆర్ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించి నిత్యం పూజలు చేస్తున్నారు. కేసీఆర్ పై ఉన్న అభిమానం వల్లే ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు శ్రీనివాస్ తెలిపారు..ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం తో అతనికి పిచ్చి పట్టింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయం పై కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.. మొత్తానికి అతను ఓ సెలెబ్రేటి అయిపోయ్యాడు..

Read more RELATED
Recommended to you

Latest news