చరిత్ర సృష్టించిన కేసీఆర్‌.. 9 వ సారి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా ఎన్నిక

-

టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ సమావేశం లో అధికారికంగా సీనియర్‌ నాయకులు కేకే ప్రకటించారు. దీంతో 9 వ సారి టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ ఎన్నికయ్యారు.

ఇక ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవ రావు మాట్లాడుతూ… మరోసారి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా ఏకగ్రీవం అయినందుకు అభినందనలు అన్నారు. తెలంగాణ తెచ్చి ప్రజల వృదాయాల్లో నిలిచిన వ్యక్తి కేసీఆర్- పార్టీ టీఆర్ఎస్ అని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన నడుం బిగించారని… నీళ్లు- నిధులు- నియమాకల్లో తెలంగాణ ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. కేసీఆర్ పథకాలు దేశానికి రోల్ మోడల్ గా మారాయని చెప్పిన కే కేశవ రావు… అభివృద్ధి- సంక్షేమం కనపడని వాళ్లే కేసీఆర్ ను విమర్శిస్తున్నారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news