కేసీఆర్ నా మాటకు చాలా విలువ ఇచ్చారు : కేకే

-

బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నా మాటకు చాలా విలువ ఇచ్చారు అని కేకే తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడారు కేకే. తెలంగాణ ఇవాళ దేశంలో నెంబర్ వన్  రాష్ట్రంగా తీర్చిదిద్దారు కేసీఆర్. 13 ఏళ్ల తీర్థ యాత్ర తరువాత సొంత ఇంటికి వస్తున్నాను. 85 ఏళ్ల రాజకీయ జీవితంలో దాదాపు 55 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని తెలిపారు. తెలంగాణ కోసం ఎంపీలతో కలిసి పోరాటం చేశానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను.

దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్ నేట్ ఇంకో పార్టీ లేదు అన్నారు. నా రాజకీయ జీవితంలో నాకు కాంగ్రెస్ పార్టీ ఎంతో ఇచ్చింది. రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు తెలిపారు. ఎంపీగా, మంత్రిగా, సీడబ్ల్యూసీ మెంబర్ గా కాంగ్రెస్ పార్టీలో పని చేసినట్టు తెలిపారు. చిన్న గొడవతోనే తాను కాంగ్రెస్ పార్టీని వీడానని తెలిపారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే.. తెలంగాణ వచ్చిన తరువాత నేను  టీఆర్ఎస్ పార్టీలో చేరానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news