యాదాద్రికి 22 సార్లు వచ్చిన కేసీఆర్.. ఒక్క ఇళ్లయినా కట్టించారా.? : కోమటిరెడ్డి

-

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.భారీగా వచ్చిన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పాలిట శాపంగా మారాయని రైతు పండించిన పంటను కొనాల్సిన ప్రభుత్వాలే ధర్నాలు చేస్తున్నాయని అన్నారు.యాదాద్రి ఆలయ ప్రారంభానికి ప్రభుత్వ డైరెక్షన్ ప్రకారమే ఆలయ ఉద్ఘాటనకు నన్ను పిలవలేదని మౌలిక సదుపాయాలు లేకున్నా ఆలయాన్ని ప్రారంభించారని అన్నారు. ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా ఆలయాన్ని ప్రారంభించి భక్తులను ఇబ్బంది పెట్టడం సరికాదు అన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.యాదాద్రిలో ప్రభుత్వం లేనిపోని ఆంక్షలు పెట్టి భక్తులను ఇబ్బంది పెట్టొద్దని, ప్రజల సొమ్ముతో ఆలయాన్ని నిర్మించి టీఆర్ఎస్ లీడర్లకే సొంతమన్నట్లు ప్రజలపై ఆంక్షలు పెడుతున్నారని ఆలయ నిర్మాణంలో వంద లోపాలు ఉన్నాయని అన్నారు.వెంటనే ఆటోలను కొండపైకి అనుమతించాలి.

యాదాద్రికి 22 సార్లు వచ్చిన సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టలో ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లయినా కట్టించారా.? అని ప్రశ్నించారు ఎంపీ కోమటిరెడ్డి. ఆలయ ప్రారంభాన్ని తూతూ మంత్రంగా చేయడంతో గుట్టలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలింది.భద్రాచలం ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తానని చెప్పి ఎనిమిదేళ్లవుతున్నా నయా పైస ఇయ్యలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక భద్రాచలం ఆలయాన్ని సీఎం కేసీఆర్ పట్టించుకోలేదు. రూ.200 కోట్లతో భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. యాదాద్రి అభివృద్ధిలో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news