“ఆదిపురుష్” Update : రాముడిగా ప్రభాస్.. మరి సీత ఎవరో తెలుసా..!

-

‘బాహుబలి’ సినిమాతో ప్యాన్‌ ఇండియా స్టార్‌ గా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ అనే చిత్రం చేస్తున్నాడు.. దాని తర్వాత నాగ్ అశ్విన్ తో మరొక చిత్రం చేయనున్నాడు. అయితే ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే ప్రభాస్ తన తర్వాత సినిమా గురించి ఇటీవలే చెప్పాడు. అదే “ఆదిపురుష్” ఓం రౌత్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్న విషయం అందరికి తెలిసందే.

టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దీన్ని తెరకెక్కించనున్నారు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో సీత ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు కీర్తిసురేష్ ఈ చిత్రంలో సీత పాత్రలో కనిపించబోతున్నారట. రాముడి అవతారమెత్తనున్న ప్రభాస్ కు మ్యాచ్ అవ్వాలంటే ఆ రేంజ్ హీరోయిన్ కీర్తిసురేష్ అని నిర్మాతలు భావిస్తున్నారట.

 

Read more RELATED
Recommended to you

Latest news