డైరెక్ట్ గా దేవుడ్ని కలవచ్చు అనే మూఢనమ్మకంతో 47 మంది బలవన్మరణం !

-

దేవుడు మీద నమ్మకం ఉండాలి.. కానీ అతి నమ్మకం ఉంటే ప్రమాదమని ఎప్పుడూ వినడమే.. కానీ తాజాగా జరిగిన ఒక సంఘటన గురించి తెలిస్తే అయ్యో పాపం అని అనకుండా ఉండలేరు. కెన్యా దేశంలో జరిగిన ఘటన ప్రపంచమంతటా సంచలనాన్ని రేకెత్తిస్తోంది. కిల్ఫీ ప్రావిన్స్ ప్రాంతానికి చెందిన ఒక క్రైస్తవమత ఫాస్టర్ చెప్పిన మాటలకు 47 మంది మరణించారు. పూర్తి వివరాల ప్రకారం జీసస్ ను మీరు కలుసుకోవాలి అంటే కఠినంగా ఉపోయావాసం చేసి మరణిస్తేనే దేవుని దగ్గరకు వెళుతారంటూ నమ్మబలికాడు. అయితే దేవుడు అంటే అమితమైన ప్రేమ ఉన్న భక్తులు ఆయన మాటలకు మైమరచిపోయారు.

అతను చెప్పినట్లు చేసి కఠినమైన ఉపవాసం చేసి బలవన్మరానికి పాల్పడ్డారు. కెన్యాలోని ఒక ఫారెస్ట్ లో పది రోజుల ముందు 11 మృతదేహాలు మరియు నిన్న 26 మృతదేహాలను బయటకు తీశారు. చనిపోయిన వారిలో చిన్న పిల్లలు కూడా ఉండడం చాలా బాధాకరం.

Read more RELATED
Recommended to you

Latest news