ఇలాగే వదిలేస్తే ఏపీ దారుణంగా తయారవుతుంది : కేశినేని నాని

-

శాంతి భద్రతలు లేకపోతే రాష్ట్రం బాగుపడదని విజయవాడ టీడీపీ కేశినేని నాని అభిప్రాయపడ్డారు. రైతులకు సబ్సిడీపై మూడో విడత ట్రాక్టర్లను పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సర్కార్‌పై మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందాయని ఆరోపించారు. టీడీపీ ఎంపీలతో కలిసి సోమవారం పార్లమెంట్‌లో ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు.

TDP MP Kesineni slams brother Chinni - The Pioneer

వైసీపీ కార్యకర్తలు హింసాత్మక చర్యలకు పాల్పడడం వల్ల సాధారణ పౌరులు, పోలీసులు గాయపడుతున్నట్టు ఇటీవల ఘటనలు నిరూపిస్తున్నాయి. వైసీపీ విధ్వంసకాండ వల్ల ప్రజా ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన ఘటనలే అందుకు నిదర్శనం అని అన్నారు.
ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మీరు వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ఏపీలో పరిస్థితులు దారుణంగా తయారవుతాయని తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news