ఏపీ ప్రభుత్వానికి కియా సంస్థ భారీ విరాళం

-

కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వానికి సహాయం చేసేందుకు ప్రముఖ కార్ల తయారీ కియా ముందుకొచ్చింది. కోవిడ్‌–19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం కియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆంధ్రప్రదేశ్‌ విపత్తు నిర్వహణ సంస్ధ (ఏపీఎస్‌డిఎంఏ)కి రూ.5 కోట్లు విరాళం అందించింది. కియా సంస్థ ఈ మొత్తాన్ని నెఫ్ట్‌ ద్వారా బదిలీ చేసింది.

ఈ విరాళానికి సంబంధించిన పత్రాలను కియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ, సీఈవో కుక్‌ హ్యున్‌ షిమ్‌ ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌కు అందజేసారు. విరాళానికి సంబంధించిన నిధులను ఆక్సీజన్‌ కాన్సెన్‌ట్రేటర్స్, వెంటిలేటర్స్, క్రయోజనిక్‌ ట్యాంకర్లు తదితర వైద్య పరికరాల కొనుగోలుకు వినియోగించాలని కియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు సీఎం జగన్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, మేకపాటి గౌతమ్‌రెడ్డితో పాటు కియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news