దేశ ఆర్థిక వ్యవస్థపై కెసిఆర్ కు కిషన్ రెడ్డి సవాల్… చర్చకు ప్రగతి భవన్ కు వస్తా !

-

కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. దేశ ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్‌కు సవాల్ చేస్తున్నా.. దేశ ఆర్థిక ప్రగతిపై కేసీఆర్‌తో చర్చకు నేను సిద్ధమన్నారు కిషన్ రెడ్డి. ప్రెస్‌క్లబ్, గన్‌పార్క్, ప్రగతిభవన్‌లో ఎక్కడ చర్చకు వస్తారు.. ఎక్కడ చర్చకు రమ్మన్నా నేను వస్తానన్నారు కిషన్‌ రెడ్డి.


రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని వస్తారా, రండి.. దేశ ఆర్థిక పరిస్థితిపై అవగాహన లేకుండా గూగుల్‌లో సెర్చ్ చేయండి.. బీజేపీ, కేంద్రంపై ద్వేషంతో విషప్రచారం చేస్తున్నారు.. కేసీఆర్, రాజీనామాకు తొందరెందుకు.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజీనామా లేఖ ఇవ్వకతప్పదని తెలిపారు కిషన్‌రెడ్డి. కేసీఆర్ దేశాన్ని అవమానించే విధంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ రాజీనామా చేస్తానని ఎన్నోసార్లు చెప్పారని.. ఆరేడు నెలలు ఆగితే రాజీనామా చేసే పరిస్థితి తప్పకుండా వస్తుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news