కేసిఆర్ మళ్లీ అదే చెబుతున్నారు : కిషన్ రెడ్డి

-

దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య మొదలైన మాటల యుద్ధం ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో మరోసారి బిజెపి పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. ఇటీవలే జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో పై స్పందించిన తెలంగాణ బీజేపీ కీలక నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సంచలన విమర్శలు గుప్పించారు.

టిఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టో ఆచరణలో సాధ్యం కాదు అంటూ వ్యాఖ్యానించారు కిషన్ రెడ్డి. గత జీహెచ్ఎంసీ ఎన్నిక లో ఏదైతే మేనిఫెస్టో ప్రకటించారో ప్రస్తుతం అదే మేనిఫెస్టోను అక్షరం పొల్లుపోకుండా సీఎం కేసీఆర్ ప్రకటించారు అంటూ గుర్తు చేశారు. అదే హామీలు అంటూ చెప్పుకొచ్చారు. టిఆర్ఎస్ చెబుతున్న మాటలకు చేస్తున్న చేతలకు అసలు పొంతన లేదు అంటూ విమర్శలు గుప్పించిన కిషన్ రెడ్డి.. విశ్వ నగరంగా ఉన్న భాగ్యనగరాన్ని విషాద నగరంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం మార్చిందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news