కవితకి ఈడీ నోటీస్ ఇస్తే…. తప్పేంటి ? – కిషన్ రెడ్డి

-

కవితకి ఈడీ నోటీస్ ఇస్తే, తప్పేంటి ? అని నిలదీశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీ కవితకి ఈడీ నోటీస్ ల పై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈడీ నోటీసులు ఇస్తే తప్పేంటి ? అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. లిక్కర్ వ్యాపారం చేసింది మీరు, అక్రమ సంపాదన చేసింది మీరని కేసీఆర్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.

ఢిల్లీలో అక్రమ పాలసీలో భాగస్వామ్యం అయి ధనార్జన చేశారని నిప్పులు చెరిగారు. ఈడీ నోటీస్ లతో మాకు సంబంధం లేదన్నారు కిషన్ రెడ్డి. లిక్కర్ ఏరులై పారుతోంది, ఊర్ల లో 24 గంటల బెల్ట్ షాప్ లు తెరిచే ఉంటున్నాయి…ఎమ్మెల్యే ల కొనుగోలు జరుగుతుందని అంటున్నారో అందులో ముగ్గురు పార్టీ ఫిరాయించిన వారేనని చెప్పారు కిషన్ రెడ్డి. ఎన్నికలను పూర్తిగా కలుషితం చేశారు… మహిళ గవర్నర్ కు ప్రోటోకాల్ లేకుండా అవమానపరుస్తున్నారు.. శాసన సభ స్థాయి తగ్గించారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news