14 ఎకరాల వేలానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు

-

14 ఎకరాల భూమి వేలానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సీఆర్డీఏ పరిధిలోని ఈ భూముల వేలానికి కసరత్తు చేస్తోంది. నవులూరు సమీపంలోని బైపాస్‌ వద్ద 10 ఎకరాలు, పిచ్చుకలపాలెం వద్ద 4 ఎకరాలను ఈ-ఆక్షన్‌ పోర్టల్ ద్వారా వేలం వేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఇంతకీ దీని ధర ఎంతంటే..?

ఏపీ సర్కార్ వేలం వేసేందుకు నిర్ణయించిన 14 ఎకరాల భూమి ధరను గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన అధికారులు ఖరారు చేశారు. నవులూరు వద్ద ఎకరా రూ.5.94కోట్లు, పిచ్చుకలపాలెం వద్ద ఎకరా రూ.5.41కోట్లుగా నిర్ణయించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వేలానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

మరోవైపు సీఆర్డీఏ పరిధిలోని భూముల విక్రయంపై రాజధాని ప్రాంత రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్లూరులోని దీక్షా శిబిరంలోమహిళలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు భూముల అమ్మకాలేంటని రైతులు నిలదీస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news