మోడీ మాకు నరకం చూపిస్తున్నారు – కిషన్ రెడ్డి సంచలనం

-

జాతీయ జెండాకు ప్రాణం పోసింది కృష్ణా జిల్లా అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 2014 లో సమర్థవంతమైన నాయకుడు దేశానికి కావాలని మోదీని ఎన్నుకున్నారు…గత ప్రభుత్వంలో 12 కోట్ల కుంభకోణాలు జరిగాయన్నారు. మోదీ నాయకత్వంలో ఒక్క అవినీతి మరక లేదు….మోదీ మాకు పని విషయంలో నరకం చూపిస్తారని వెల్లడించారు.

గతంలో రిమోట్ కంట్రోల్ ప్రైమ్ మినిస్టర్ ఉండేవారని అందరికి తెలుసు అని…8 సంవత్సరాలుగా మోదీ ఒక్క సెలవు లేకుండా పని చేస్తున్నారన్నారు కిషన్ రెడ్డి.ఒక్క రోజు కూడా సచివాలయానికి రాని మా రాష్ట్ర సియం…20 రోజులు ఫామ్ హౌస్…10 రోజులు ఇంట్లో అని…మోదీ పుట్టినరోజు సైనికులతో చేసుకుంటారని తెలిపారు. జి-20 సమావేశాల్లో గత ప్రభుత్వ ప్రధాని ఎక్కడో కని కనిపించని స్థానంలో కూర్చునేవారు….. కానీ మోదీ స్థానం ఎక్కడో అందరికీ తెలుసు అన్నారు.

భారతీయులు అనేక దేశాల్లో తలెత్తుకుని తిరుగుతున్నారు..ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద వాక్సినేషన్ కార్యక్రమం మన దేశంలోనే జరుగుతుందని పేర్కొన్నారు. అమెరికా కూడా మన కరోనా వాక్సిన్ కావాలంటుంది..100 దేశాలకు కరోనా వాక్సిన్ అందించామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news