ఆట ఇప్పుడు మొదలైంది.. ఇక మేమేంటో చూపిస్తాం : కిషన్ రెడ్డి

-

మునుగోడు ఉపఎన్నికలో నైతిక విజయం బీజేపీదేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉపఎన్నిక ఫలితాలపై ఆయన తాజాగా స్పందించారు. ఈ ఎన్నికలో ఓడినా.. మునుగోడు ప్రజల నమ్మకాన్ని గెలిచామని అన్నారు. కేవలం రాజగోపాల్ రెడ్డిపై గెలవడానికి అధికార టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలను వేల మందిని నియోజకవర్గంలో దింపిందని.. వాళ్లు తమకు భయపడే వాళ్లందిరిని నియోజకవర్గంలో దింపారని.. వారు భయపడినప్పుడే తమ గెలుపు ఖాయమైందని తెలిపారు.

అసలైన ఆట ఇప్పుడే మొదలైందన్న కిషన్ రెడ్డి.. ముందు ముందు మరింత కసిగా పని చేసి తామేంటో చూపిస్తామని అన్నారు. ప్రలోభాలు, బెదిరింపులతో గెలిచిందని ఆరోపించారు. మునుగోడులో డిపాజిట్ రాని పరిస్థితి నుంచి రెండో స్థానంలోకి వచ్చామని పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని కిషన్​రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news