లోకేష్ గురించి మాట్లాడటం పరమ వేస్ట్ : కొడాలి నాని

-

కృష్ణా జిల్లా నందిగామలో కొడాలి నాని లోకేష్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టుగా లోకేష్ వ్యవహరం ఉందని ఆయన అన్నారు. వరదలు ఎప్పుడు వచ్చాయి…..ఎప్పుడు పరిశీలిస్తున్నారు ? అని నాని ప్రశ్నించారు. మొదటి ట్రిప్పు తలకాయ ఉన్న వాడు ఎవడయినా కొల్లేరులో పెట్టుకుంటారా ? అని ఆయన అన్నారు. లోకేష్ ఆఫ్ నాలెడ్జ్ వ్యక్తి అని ఆయనకు పార్టీ నడపడం రాదు, ట్రాక్టర్ నడపడం రాదు అని అన్నారు.

తెలుగు దేశం పార్టీ కూడా లోకేష్ నాయకత్వంలో ఉంటే కొల్లేటిలో ట్రాక్టర్ ఏ విధంగా దించాడో టీడీపీని కూడా దించుతాడని ఆయన అన్నారు. బుద్ధి ఉన్నోళ్ళు అయితే ముందుగా ట్రాక్టర్ నుండి దిగిపోండి ఆ తరువాత పార్టీ నుండి దిగిపొండని అన్నారు. లోకేష్ గురించి ఎక్కువగా మాట్లాడటం పరమ వేస్ట్ అని నాని తేల్చేశారు. అయితే ముంపు ప్రాంతాల పర్యటన కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న లోకేష్ ట్రాక్టర్ నడపగా అది పక్కకి వెళ్ళిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news