టిఆర్ఎస్ ఎమ్మెల్యే లను చెప్పులతో కొట్టండి : కోమటిరెడ్డి సంచలనం

-

టిఆర్ఎస్ ఎమ్మెల్యే లను చెప్పులతో కొట్టండని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరి ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల గోస పెడుతున్నారని.. సీఎం కెసిఆర్ ను కూడా అడ్డుకోండని ప్రజలకు పిలుపు నిచ్చారు కోమటిరెడ్డి. తాను ఎవరితో నైనా కలిసి పనిచేస్తానని.. కాంగ్రెస్ అంటే కోమటిరెడ్డి…ఉత్తమ్..రేవంత్ లే కాదన్నారు.

komatireddy venkatreddy

కార్యకర్తల వల్లనే మేము నాయకుల అయ్యామని.. నేను అడిగింది పిసిసి పదవి అని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా పార్టీ కోసం పని చేస్తానని.. పదవులు ఎవరైనా తీసుకొని.. కానీ తాను 7 ఎమ్మెల్యే లను గెలిపిస్తానని స్పష్టం చేశారు. మిగిలిన నాయకులు కూడా తలా 10 మందిని గెలిపిస్తే చాలన్నారు. తెలంగాణ రైతుల సమస్యలపై పార్లమెంట్ లో లేవనేత్తుతామని ప్రకటించారు. సోనియా గాంధీ తో కూడా పార్లమెంట్ లో రైతుల సమస్య పై మాట్లాడిస్తామని స్పష్టం చేశారు కోమటిరెడ్డి. ధాన్యం కొనుగోలుపై ఢిల్లీలో ఆందోళన చేస్తాం… ప్రియాంక గాంధీ నీ కూడా పిలుస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news