మా మంత్రులు దుష్ట శక్తులు… వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

-

తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మరోసారి వార్తల్లో నిలిచాడు. మొన్నటికి మొన్న ఒక గ్రామ వాలంటీర్ ని అసభ్య పదజాలంతో ఆయన తిట్టడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేయడం వివాదాస్పదంగా మారింది. తాజాగా ఈయన తన పార్టీ మంత్రులు మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ మంత్రులు దుష్టశక్తుల వ్యవహరిస్తున్నారని ఆయన నిన్న వ్యాఖ్యానించారు. తాను మొదటిసారి ఎమ్మెల్యే అందుకే తనకు మంత్రులు ఎవరు సహకరించడం లేదని ఆయన ఆరోపించారు.

అంతే కాదు తనకు తన నియోజకవర్గ ప్రజలకు మధ్య మంత్రులు విభేదాలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిన్న పి గన్నవరం నియోజకవర్గం లోని అయినవిల్లి మండలం శంకరయ్య గూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్ర కార్యక్రమంలో మంత్రుల మీద ఈ విధంగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు. మరి ఈ విషయం మీద సదరు మంత్రులు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news