తెలుగు రాష్ట్రాల కరోనా పరిస్థితులపై రాష్ట్రపతి కోవింద్ ఆరా !

-

తెలంగాణా గవర్నర్ తమిళిసైకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫోన్ చేశారు. ఈ నెల7 న జరిగే జాతీయ విద్యావిధానం వీడియో కాన్ఫరెన్స్‌ మీద ఆయన చర్చించారు. అంతే కాక తెలంగాణలో కూడా కరోనా పరిస్థితులపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సందర్భంగా జాతీయ విధానంపై విద్యావేత్తలతో నిర్వహించిన వెబ్‌నార్ గురించి రాష్ట్రపతికి గవర్నర్‌ తమిళిసై వివరించారు. ఇక ఈ వెబ్‌ నార్‌ లో విద్యా శాఖా మంత్రితో పాటు, వైస్ ఛాన్స్‌లర్లు పాల్గొననున్నారు.

ram nath kovind orders to home ministries for telangana inter students suicide report
ram nath kovind orders to home ministries for telangana inter students suicide report

ఇక ఏపీ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్ కి కూడ ఆయన ఫోన్ చేశారు. ఈ నెల 7న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగబోయే జాతీయ విద్యా విధానం-2020 సమావేశం గురించి చర్చించిన రాష్ట్రపతి రాష్ట్రంలో ప్రస్థుత కోవిద్ సమస్య గురించిన వివరాలు కూడా అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఇద్దరు గవర్నర్ లకి పలు సూచనలు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఈరోజు జాతీయ విద్యా విధానం-2020 సమావేశం గురించి దాదాపు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల గవర్నర్ లకు ఆయన ఫోన్ లు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news