అచ్చన్నా శరీరం.. ఓ ఆంబోతు, ఎలుగుబంటు, దున్నపోతు లాగా ఉంటుంది -నల్లపురెడ్డి

-

కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి షాకింగ్‌ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 160 సీట్లు ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు అంటున్నారని.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మీ రాజధాని ఏదని అడుగుతున్నారని మాట్లాడడని ఫైర్ అయ్యారు. అచ్చన్నా నాయుడు శరీరం చూస్తే ఒక ఆంబోతు,ఒక ఎలుగుబంటు, ఒక దున్నపోతు, తెలివి లేని దద్దమ్మలాగా ఉంటుందని చురకలు అంటించారు.

తిరుపతి హోటల్లో టిఫిన్ చేస్తూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా. పార్టీ లేదూ…. ఏమీ లేదని మాట్లాడాడు… ఆ వీడియో మొత్తం వైరల్ అయిందన్నారు. రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడిగా అచ్చం నాయుడు ఏం మాట్లాడాడో అందరూ చూశారు…చంద్రబాబు నాయుడు దగ్గర మెహర్బానీ కోసం 165 సీట్లు వస్తాయని చెబుతున్నాడు.

కోవూరు నియోజక వర్గంలో ని నర్సాపురం గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందని తెలిపారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతటా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే ఈ నరసాపురం ప్రజలు మాత్రం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకొని తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఇచ్చారని వెల్లడించారు. అయినా కూడా మేము పార్టీలు చూడలేదు.. కులాలు.. మతాలు .. వర్గాలు చూడకుండా అందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news