స్టార్ దొరక్కముందే సినిమా ప్రకటించేసిన క్రిష్ణవంశీ..

-

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా కొనసాగిన క్రిష్ణవంశీ, గత కొన్ని రోజులుగా హిట్లు లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఐతే ప్రస్తుతం రంగమార్తాండ సినిమాతో బిజీగా ఉన్న క్రిష్ణవంశీ, శివరాత్రి కానుకగా తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. అన్నం అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. సినిమా పేరయితే ప్రకటించాడు గానీ, అందులో నటించే వాళ్ళెవరనేది చెప్పలేదు. నిజానికి ఇప్పటి వరకు క్యాస్టింగ్ గురించి ఆలోచించలేదట. ముందుగా సినిమా ప్రకటించేసి ఆ తర్వాత ఎవరైనా స్టార్ హీరోని పెట్టుకోవాలని అనుకున్నాడట. మరి ప్రస్తుతం స్టార్ హీరోలందరూ చాలా బిజీగా ఉన్నారు.

ఒక్కొక్కరి చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. మరి క్రిష్ణవంశీ దొరికే హీరో ఎవరో చూడాలి. అటు రంగమార్తాండ సినిమా ఇంకా పూర్తికాక ముందే, ఆ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ ఇవ్వకముందే మరో సినిమా ప్రకటించడం కొద్దిగా ఆశ్చర్యమే. మరి క్రిష్ణవంశీ ప్రకటించిన అన్నం సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news