బండి సంజయ్ కి కేటీఆర్ సవాల్… గంగుల కమలాకర్ పై పోటీ చేసి గెలవాలి

-

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. బండి సంజయ్ కు దమ్ముంటే.. మళ్లీ మా గంగుల కమలాకర్ మీద పోటీ చేసి గెలుపు.. ఈ సారి గంగుల కమలాకర్ లక్ష మెజారిటీతో గెలవడం ఖాయమని అన్నారు. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కనీసం రూ. 3 కోట్ల నిధులైనా తెచ్చాడా.. అని ప్రశ్నించారు కేటీఆర్. కేంద్ర వల్ల తెలంగాణకు ఏమైనా ఒరిగిందా..? అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతీయ హోదా కోసం బండి సంజయ్ ఏనాడైనా కేంద్రాన్ని అడిగాడా అంటూ ప్రశ్నించారు. డబ్బలో రాళ్లేసి ఊపినట్లు ఒకటే లొల్లి చేస్తడని విమర్శించారు. హిందూ ముస్లిం పంచాయతీ తప్ప సంజయ్ కు ఏమీ రాదని.. కరీంనగర్ లో కనీసం ఓ గుడి అయినా తెచ్చావా అని అన్నారు. కరీంనగర్ కు బండి సంజయ్ ఏం పీకలేదని విమర్శించారు. ముస్లీంలు అంతా దేశానికి ద్రోహులు అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. మూడేళ్లలో మూడు పైసల నిధులు కూడా తీసుకురాలేదని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ను తిట్టుడు తప్పితే ఏమైనా చేశారా..? అని బండి సంజయ్ ని ప్రశ్నించారు. మతం పిచ్చి కడుపు నింపదు అని అన్నారు. బండి సంజయ్ యువతను చెడగొడుతున్నాడని విమర్శించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news