రూపాయికే నల్లా కనెక్షన్‌.. దసరా వరకు అందరికీ తాగునీరు : కేటీఆర్

-

రాజన్నసిరిసిల్ల జిల్లా : వేములవాడ లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ… ప్రతి వార్డును పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. వేములవాడ లో ఎంత చేసినా తక్కువేనని పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలో
ఇంటి ఇంటికి నల్ల నీరు 60 శాతం పూర్తయిందని… చెప్పారు. దసరా వరకు పూర్తి చేసి అందరినీ త్రాగునీరు అందిస్తామని ప్రకటించిన మంత్రి కేటీఆర్‌.. రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తామని స్పష్టం చేశారు.

అలాగే రైతు బజార్ నిర్మాణానికి 5 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తు చేసిన కేటీఆర్‌… వైకుంఠదామానికి కోటి 50 లక్షలు కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు. ఎస్సీ కాలనీ లో 25 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టామని…అలాగే… పట్టణంలోని 100 పడకల ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్‌. వంద పడకల ఆసుపత్రిలో రూ. 40 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.వేముల వాడ పట్టణ అభివృద్ధికి ఎప్పుడు ముందుంటామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news