తెలంగాణ మొదటి ద్రోహి రేవంత్ రెడ్డి – టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

-

స్వాతంత్య్రం వచ్చిన 70కాంగ్రెస్ 60 ఏళ్లు పాలించింది. ఇన్నేళ్లలో మీరు ఏం పాలించారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. ఫ్లోరైడ్ తో నల్గోండ అతలాకుతలం అయింది. కాంగ్రెస్ పాపాలు పెరిగినట్లు ఫ్లోరోసిస్ పెరిగింది. మంచినీటిని అందిస్తున్న కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మట్లాడుతున్నారు. తెలంగాణకు మొదటి ద్రోహి రేవంత్ రెడ్డే అని కేటీఆర్ విమర్శించారు. జంగ్ లేదు బొంగు లేదు జంగ్ సైరన్ లేదంటూ, టీపీసీసీ, టీబీజేపీ కేసీఆర్ పెట్టిన బిక్ష అని కేటీఆర్ విమర్శించారు.ktr మానిక్కం ఠాగూర్ కు రూ. 50 కోట్లు ఇచ్చి టీపీసీసీ తెచ్చుకున్నట్లు ఆపార్టీ నేతలే ఆరోపిస్తున్నారని గుర్తుచేశారు. తన్నది అరగక చేసే పాదయాత్ర సంజయ్ ది అని బీజేపీని విమర్శించారు. మతాన్ని అడ్డుపెట్టుకున రాజకీయం చేసేది బీజేపీ అని అన్నారు. ఇంటింటికి నీరందిచే పథకాన్ని కేంద్రమే మెచ్చుకుందని గుర్తు చేశారు. రాష్ట్రం మొత్తం దళితబంధు ఇస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే రాష్ట్రం మొత్తం చేస్తామన్నారని గుర్తుచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news