స్టీల్ ప్లాంట్ పై కేటీఆర్ క్లారిటీగా మాట్లాడాలి – మంత్రి అమర్నాథ్

-

విశాఖ స్టీల్ ప్లాంట్ పై మంత్రి కేటీఆర్ క్లారిటీగా మాట్లాడాలన్నారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం అంటూనే బిడ్డింగ్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని కేటీఆర్ తెలిపారని వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకమని, అయినా దుష్ప్రచారం చేయడం దారుణం అన్నారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారని.. మూడు లక్షల మంది ప్రజల సాక్షిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని సీఎం జగన్ గళం వినిపించారని అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వమే భరించలేమంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా భరించగలరని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news