జేపీ నడ్డా… అబద్ధాల అడ్డా : కేటీఆర్ ఫైర్

-

జేపీ నడ్డా… అబద్ధాల అడ్డా అని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. జేపీ నడ్డాది…కేర్ ఆఫ్ ఎర్రగడ్డ అని.. చురకలు అంటించారు. జేపీ నడ్డా అంటే పెద్ద మనిషి అనుకున్నాము కానీ బండి సంజయ్ కు …జేపీ నడ్డాకు పెద్ద తేడా లేదని ఎద్దేవా చేశారు కేటీఆర్. బిజెపి అంటే భక్వాస్ జుమ్లా పార్టీ అని.. యూపీలో బీజేపీ సర్కార్ చేసింది ఏమి లేదు…అంతా చిల్లర రాజకీయం అని అగ్రహించారు.

ktr

దేశంలో చిచ్చు పెట్టి నాలుగు ఓట్లు వేయించుకోవాలని బిజెపి ఆలోచన అని.. ఎన్డీఏ ప్రభుత్వం లో భాగ్యస్వామ్యా పక్షాలు ఎవరు అంటే బిజెపి, ఈడీ, సిబిఐ, ఐటిలు అని అగ్రహించారు. ఢీల్లీలో కొంత మీడియా మోడీయగా మారిందన్నారు. ప్రధాన మోడీని పంజాబ్ లో రైతులు అడ్డుకున్నారని.. దేశచరిత్రలో ఏ ప్రధాన మంత్రికి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎదురు కాలేదని ఎద్దేవా చేశారు. సిగ్గులేని… నీతిలేనిది నేత మోడీ అని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news