ఆ ఇద్దరూ డిసెంబర్ 11 తర్వాత వాయించుకోవడమే…కేటీఆర్

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ రాహుల్ గాంధీ – చంద్రబాబు పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కూకట్‌పల్లిలో శనివారం నిర్వహించిన సీమాంధ్రుల సంఘీభావ సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ… కొద్ది రోజలు క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి, రాహుల్‌గాంధీకి వీణ బహుకరించారు… ఆ తర్వాత రాహుల్‌, చంద్రబాబుకు ఫిడేల్‌ ఇచ్చారని గుర్తుచేశారు. దీంతో త్వరలోనే తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్‌ వీణ వాయిస్తుంటే, చంద్రబాబు ఫిడేల్‌ వాయించుకోవడం తథ్యమని ఎద్దేవా చేశారు. ‘తెలంగాణ ఏర్పడ్డాక 16 నెలలకు హైదరాబాద్‌ కార్పొరేషన్‌కు వచ్చిన ఎన్నికల్లో తెరాస 99 సీట్లు సాధించిందని గుర్తుచేశారు.
ఒకాయన చెవి కోసుకుంటా అన్నాడు..మరొకాయన రాజకీయ సన్యాసం…
అత్యుత్సాహంతో మన సీపీఐ నారాయణ అయితే ఓ అడుగు ముందుకేసి.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాస గెలిస్తే చెవి కోసుకుంటా అన్నారు. ఓ టీడీపీ నేత రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. గతంలో హైదరాబాద్‍ అంటేనే గొడవలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునేవాళ్లం ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు.. ఎందుకంటే శాంతి భద్రతలకు తెరాస మొదటి ప్రాధాన్యత ఇచ్చింది. హైదరాబాద్‍ అనేది విశ్వనగరంలో ఈ ప్రాంతంలో ఏ ప్రాంతానికి చెందిన వారైన స్వేచ్ఛగా జీవించవచ్చు..ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటూ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news