పార్టీ మారిన వాళ్లు తిరిగొచ్చి.. కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా మళ్లీ రానియ్యం – KTR

-

పార్టీ నుండి వెళ్లిపోయిన వాళ్లు తిరిగొచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా మళ్లీ రానియ్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్‌ స్పష్టం చేశారు. పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఇద్దరూ కలిసి నమ్మించి మోసం చేశారని ఫైర్‌ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాజాగా తెలంగాణ భవన్ లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..

ktr warns brs leaving leaders

2014లో విశ్వేశ్వర్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఎంపీగా చేసినం… 2019లో రంజిత్ రెడ్డి మాధురి పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరితే చేవెళ్ల ప్రజల చైతన్యంతో ఓడిపోయినారని తెలిపారు. కెసిఆర్ గారి కూతురు అరెస్ట్ అయిన రోజు నవ్వుకుంటూ కాంగ్రెస్లోకి పోయిన రంజిత్ రెడ్డి… పట్నం మహేందర్ రెడ్డిల పైన మన పార్టీ కార్యకర్తలు పగ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని వెల్లడించారు. ఇదే మహేందర్రెడ్డి, రంజిత్ రెడ్డిలు మళ్ళీ వచ్చి కేసీఆర్ గారి కాళ్లు పట్టుకున్న పార్టీలోకి రానీయమని స్పష్టం చేశారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news