ఆ ఇద్దరు నా ఫేవరెట్…కుష్బూ..!

-

అలనాటి సీనియర్ స్టార్ హీరోయిన్ కుష్బూ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సీనియర్ హీరోయిన్ తాజాగా శర్వానంద్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా మార్చి 4 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా కుష్బూ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

కుష్బూ మాట్లాడుతూ దర్శకుడు కథ చెప్పినప్పుడు రీ ఫ్రెషింగ్‌గా అనిపించింది అని తెలియజేసింది. ఎందుకంటే కేవ‌లం ఆడ‌వాళ్ల‌కు అనే కాదు హ్యూమ‌న్ ఎమోష‌న్స్‌కి ప్రాముఖ్య‌త ఇస్తూ ఈ కథను దర్శకుడు రాశాడు. ముఖ్యంగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ చక్కగా కుదిరాయి. ఈ సినిమాలో కేవ‌లం ఎమోష‌న్స్ మాత్ర‌మే కాదు ఈ కాన్సెప్ట్ చాలా హిలేరియ‌స్‌గా కూడా ఉంటుంది.

ఆడవాళ్లు అంటే గ్లిజ‌రిన్‌ తోనే ఎక్కువ పని ఉంటుంది అనుకుంటారు. ఈ మూవీ లో ఈ భావన తప్పు అని తెలుస్తుంది. వారు సంతోషంగా ఎందుకు ఉండకూడదు అనే కోణంలో దర్శకుడు ఈ కథను రాశారు అని ఖుష్బూ తెలియజేసింది. రాధిక గారు, ఊర్శ‌శి గారు నా ఫేవ‌రేట్ యాక్ట‌ర్స్‌. వాళ్లు గ్రేట్ యాక్ట‌ర్స్ ..వారితో క‌లిసి వర్క్ చేయ‌డం చాలా క‌ష్టం అని కుష్బూ అన్నారు. కథ నచ్చితే కొత్త వారితో కూడా సినిమా చేయడానికి సిద్ధమే అని కుష్బూ తెలియజేసింది.

Read more RELATED
Recommended to you

Latest news