కొత్తగా ఇండ్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు ఇస్తాం – కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

-

కొత్తగా ఇండ్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు ఇస్తామని… ఎన్నికల కోడు ముగియగానే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని టిఆర్ఎస్ మునుగోడు అభ్యర్థి  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో.. ఉభయ కమ్యూనిస్టు లు కలిసి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీపీఐ, సీపీఎం పార్టీలు బలపరిచిన మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ చండూర్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

చండూర్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని, మునుగోడు టీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ..* ఈ సభను చూస్తుంటే మా తాత, తండ్రి జ్ఞాపకం వస్తుండు. పోరాటాలు, ఉద్యమాలు గుర్తుకు వస్తున్నాయి.కష్టం, కన్నీళ్లు ఉన్న చోట తోడు ఉండు అని వారు చెప్పిన మాటలు యాదికొస్తున్నాయన్నారు.

 

మత తత్వ పార్టీ బీజేపీని ఓడించాలని ఈరోజు బహిరంగ సభ ఏర్పాటు చేసినందుకు ఉభయ కమ్యూనిస్టులు, కామ్రేడ్ సోదరులకు ధన్యవాదాలు.2014లో ఎమ్మెల్యే గా గెలిచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. 2014లో గెలిచిన తర్వాతచౌటుప్పల్ నుంచి నల్లగొండ వరకు, మునుగోడు నుంచి చండూర్ వరకు, చౌటుప్పల్ నుండి మునుగోడు వరకు డబుల్ రోడ్డు వేయించడం జరిగిందని చెప్పారు.మీరు ఆశీర్వాదం అందించి గెలిపిస్తే ఆగిపోయిన పనులు అన్ని పూర్తి చేస్తాన్నారు. అవకాశం ఇస్తే ప్రాజెక్టులు పూర్తి చేసి చూపిస్తా. మునుగోడును అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news