మునుగోడులో టీడీపీ తరపున టీఆర్ఎస్ సీనియర్ నేత పోటీ ?

-

మునుగోడు ఉప ఎన్నిక తరుముకు వస్తున్న నేపథ్యంలో… ఆ నియోజకవర్గంలో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేశాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకున్నందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఇప్పటికే ప్రధాన పార్టీలు అయిన టిఆర్ఎస్, కాంగ్రెస్ మరియు బిజెపిలు తమ తమ పార్టీల అభ్యర్థిలను ప్రకటించేసాయి.

అటు చిన్నాచితక పార్టీలు కూడా బరిలో ఉండేందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మునుగోడు ఉప ఎన్నికల్లో… టిడిపి తరఫున బూర నర్సయ్య గౌడ్ పోటీ చేస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. భువనగిరి మాజీ ఎంపీ అయిన నరసయ్య గౌడ్ కు చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉంది.

అంతేకాదు మునుగోడు ఉప ఎన్నిక టికెట్ ను ఆశించి టిఆర్ఎస్ పార్టీలో భంగపడ్డ నాయకులు నరసయ్య గౌడ్. అయితే.. టిఆర్ఎస్ పార్టీలో టికెట్ రాకపోవడంతో ఆయన టిడిపి తరఫున పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నారట. ఇందులో భాగంగానే ఇప్పటికే చంద్రబాబుతో నరసయ్య గౌడ్… సీక్రెట్ మంతనాలు కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మరో రెండు రోజుల్లోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news