ఓడినా ప్రజల్లోనే ఉన్నా.. ఈసారి గెలుపు టీఆర్ఎస్ దే : కూసుకుంట్ల

-

గత ఎన్నికల్లో ఓడిపోయినా తాను ప్రజల మధ్యే ఉన్నానని మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపానని తెలిపారు. మరోసారి తనను గెలిపిస్తే మునుగోడు అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.

మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడెం మండలంలో మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, తాటికొండ రాజయ్యతో కలిసి కూసుకుంట్ల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి నిరోధకుడైన రాజగోపాల్‌ రెడ్డికి ఉపఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు చేయాలని అన్నారు. మునుగోడులో నిలిచిపోయిన అభివృద్ధి టీఆర్‌ఎస్‌ గెలుపుతోనే ముందుకు సాగుతుందని తెలిపారు. బీజేపీకి పుట్టగతులు లేకుండా చేయాలన్నారు.

నియోజకవర్గంలో ఎక్కడికిపోయినా ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారని కూసుకుంట్ల అన్నారు. రాజగోపాల్ రెడ్డి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడుపోయాడని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతున్నారని తెలిపారు. వచ్చిన మంచి అవకాశాన్ని వదులుకోకుండా టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం కనిపిస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను దెబ్బతీయాలని మోదీ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news