కరోనా చేసిన హత్య.. ఇద్దరు కుమారులున్నా తోపుడు బండి మీదే !

-

కనీస మానవత్వం లేని ఒక ఇంటి యజమాని నిర్వాకంతో అద్దె ఇంట్లో ఉండే ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె అనాధ కాదు ఆమెకు ఇద్దరు కుమారులు, భర్త కూడా ఉన్నారు. అయితే కరోనా సోకిందని ఇంట్లోకి ఇంటి ఓనర్ రానివ్వక పోవడంతో రెండు రోజుల పాటు రోడ్డుపై ఓ తోపుడుబండిపైనే అచేతన స్థితిలో పడి ఉంది, స్థానిక ప్రజలు ఆమెను హాస్పిటల్ కి తరలించగా అక్కడ ఆమె చనిపోయింది. ఈ దారుణ ఘటన కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో బుధవారం జరిగింది.

జమ్మికుంటకు చెందిన సుశీల అనే మహిళ కూరగాయలు విక్రయిస్తూ జీవిస్తున్నది. ఆమెకు ఇటీవల కరోనా పాజిటివ్‌ రాగా, ఇంటి యజమాని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో రెండు రోజులపాటు పట్టణంలోని తన కూర్యగాయల  తోపుడుబండిపైనే కాలం వెళ్లదీసింది. ఆమె పరిస్థితి చూసి జాలిపడి స్థానికులు వైద్యసిబ్బందికి సమాచారం అందించగా ఆమెను ఈ నెల 10న కరీంనగర్‌లోని ఐసొలేషన్‌ కేంద్రానికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.  

Read more RELATED
Recommended to you

Latest news