సీఎం జగన్‌ కు ఎన్టీఆర్‌ ఆశీస్సులు ఉంటాయి – లక్ష్మీ పార్వతి

-

సీఎం జగన్‌ కు ఎన్టీఆర్‌ ఆశీస్సులు ఉంటాయని..తెలుగు అకాడెమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేటుకి వచ్చిన తెలుగు అకాడెమీ ఛైర్మన్ లక్ష్మీ పార్వతి… కొత్త కలెక్టర్ ఢిల్లీరావుకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం.. లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ… ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పడడం సంతోషంగా ఉందని.. ఎన్టీఆర్ పేరు చెప్పి ఎంతో చేస్తున్నామన్న టీడీపీ.. చంద్రబాబు ఎన్టీఆర్ పేరు శాశ్వతంగా ఉండేలా ఒక్క చర్య తీసుకోలేదని పేర్కొన్నారు.

తన పార్టీ కాకున్నా.. ఎన్టీఆరుతో పరిచయం లేకున్నా జగన్ ఎన్టీఆర్ పేరు పెట్టారని.. చంద్రబాబు చేయలేని పనిని జగన్ చేశారని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా తరహాలోనే అల్లూరి సీతారామరాజు, సత్యసాయి, అన్నమయ్య వంటి పెద్దల పేర్లు పెట్టడం శుభ పరిణామమని.. పెద్దల ఆశీస్సులు జగనుకు లభిస్తాయని చెప్పారు. ఎన్టీఆర్ పుట్టింది నిమ్మకూరైనా.. ఎన్టీఆర్ బాల్యమంతా విజయవాడలోనే గడిచిందని.. విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఆయనకు మరింత శోభనిచ్చారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ గుడివాడలోనే కాదు హిందూపూరం, టెక్కలి వంటి ప్రాంతాల్లో కూడా పోటీ చేశారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news