ఇంటి స్థలం కబ్జా.. HRC ని ఆశ్రయించిన వృద్ధ దంపతులు

-

ఆడపిల్లల పెళ్లిల్ల కోసం అప్పు చేస్తే.. తమ ఇంటి స్థలాన్ని కబ్జా చేసారని ఓ వృద్ధ దంపతులు హెచ్చార్సీని ఆశ్రయించారు. సికింద్రాబాద్ చిలకలగూడ కి చెందిన వృద్ధ దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు. రెండవ అమ్మాయి పెళ్లి కోసం మెహెదీపట్నం లోని 50గజాల ఇంటి స్థలం డాక్యుమెంట్లు పెట్టి ఆకారం రమేష్ అనే వ్యక్తి వద్ద అప్పు చేసారు. సంతకాలు ఫోర్జరీ చేసి అక్రమంగా ఇంటి స్థలం కాజేశారు.

ఈ విషయం పై ఆసిఫ్ నగర్ పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. మరో ఇద్దరి ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలని తల్లి కన్నీరు పెట్టుకుంది. ఫోర్జరీ చేసి స్థలం కాజేసిన వారిపై చర్యలు తీసుకొని.. తమ ఇంటి స్థలం తమకు వచ్చేలా న్యాయం చెయాలని హెచ్ఆర్సీని వేడుకున్నారు. లేదంటే తమకు తమ ఆడపిల్లలకు ఆత్మహత్య దిక్కు అని కమిషన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news