నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ ఉందా.. లేదా..?

-

నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ ఉందా.. లేదా అని స్థానిక నేతల్లో అనుమానం వ్యక్తం అవుతుంది. నిజామాబాద్ కార్పొరేషన్ న్యూ మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు తీసుకొని, సవరణలు పంపి 8 నెలలు అవుతోంది. అయినా ఇప్పటికీ ఫైనల్​ నోటిఫికేషన్​ రాలేదు. నెలల గడుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ప్లాన్​ ఆమోదం పొందుతుందా? లేదా? అని లీడర్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వెంటనే నోటిఫికేషన్​ విడుదల చేయాలని ఆందోళనకు సిద్ధం అవుతున్నారు స్థానిక లీడర్లు. మరోవైపు మాస్టర్​ ప్లాన్​లో ఓ వర్గానికి ప్రధాన్యం ఇస్తూ మారుస్తున్నారేమో అని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు.

తెలంగాణ అర్బన్ ఏరియాస్ యాక్ట్ 1975 ప్రకారం 73 గ్రామాల విలీనం చేస్తూ నోటిఫికేషన్​ ఇచ్చారు. అనంతరం నిజామాబాద్​ కార్పొరేషన్​ కొత్త మాస్టర్​ ప్లాన్​ను 2018 ఆగస్ట్​లో రిలీజ్​ చేశారు. ఈ మాస్టర్​ ప్లాన్​లో ప్రధానంగా గాయత్రి నగర్ నుంచి వర్ని రోడ్డు వరకు వంద ఫీట్ల రోడ్డు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీని వల్ల సుమారు రెండు వందల కుటుంబాలకు నష్టం కలుగుతోందని వ్యతిరేకత రావడంతో 2019 నవంబర్​లో కొత్త మాస్టర్​ ప్లాన్​ను తెచ్చారు. ఆ ప్లాన్​లోనూ వంద ఫీట్ల రోడ్డును సవరించకపోవడంతో స్థానికులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేయగా.. అధికారులు మళ్లీ 2022 ఫిబ్రవరిలో మరో ప్లాన్​ను విడుదల చేశారు. ఈ ప్లాన్​లో వంద ఫీట్ల రోడ్డులో ఆశించిన మేర మార్పులు జరగలేదు. పైగా దాని ప్రభావం విలీనమైన 73 గ్రామాల మీద పడుతోందని బాధితులు అంటున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news